లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఏకగ్రీవ ఎన్నిక

byసూర్య | Wed, Jun 19, 2019, 11:54 AM

 17వ లోక్‌సభ స్పీకర్‌గా భారతీయ జనతా పార్టీ ఎంపీ ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రతిపక్షాల నుంచి స్పీకర్‌ ఎన్నికకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో బిర్లా ఎన్నిక ఏకగ్రీవమైంది. లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రొటెం స్పీకర్‌ వీరేంద్ర కుమార్‌ సభలో ప్రకటించారు. అనంతరం ఓం బిర్లాను స్పీకర్‌ చైర్‌ వద్దకు సభా నాయకుడు మోదీ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఓం బిర్లాకు సభ్యులందరూ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు స్పీకర్‌ పదవికి ఓం బిర్లా పేరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. మోదీ ప్రతిపాదనను కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షాతో పాటు పలువురు సమర్థించారు. 


Latest News
 

ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన Fri, Apr 19, 2024, 11:14 AM
చలివేంద్రాన్ని ప్రారంభించిన నాయకులు Fri, Apr 19, 2024, 11:13 AM
ఆ భూమి మొత్తం అటవీ శాఖదే Fri, Apr 19, 2024, 10:55 AM
సైబర్ నేరానికి మోసపోయిన యువకుడు Fri, Apr 19, 2024, 10:14 AM
బీఎస్పీకి కొత్త మనోహర్ రెడ్డి రాజీనామా Fri, Apr 19, 2024, 10:12 AM