byసూర్య | Wed, Jun 19, 2019, 11:14 AM
సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. బోధనాస్పత్రుల్లో ఆచార్యుల పదవీ విరమణ వయసునకు నిరసనగా జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు దిగారు. ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వైద్యుల సమ్మెతో ఎమర్జెన్సీ మినహా ఇతర వైద్యసేవలన్ని నిలిచిపోయాయి.