byసూర్య | Tue, Jun 18, 2019, 07:04 PM
రేపు పార్లమెంట్లో దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన పార్టీల అధ్యక్షులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా ఒకే దేశం.. ఒకేసారి ఎన్నికలు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నవభారత నిర్మాణం, పార్లమెంట్ సమావేశాలు మరింత అర్థవంతంగా నిర్వహించే అంశం, మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల నిర్వహణపై చర్చించనున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో జరగనున్న ఈ భేటీకి తెలుగు రాష్ట్రాల నుంచి వైసీపీ అధినేత, సీఎం జగన్, టీఆర్ఎస్ నుంచి కేటీఆర్ హాజరుకానున్నారు.