byసూర్య | Tue, Jun 18, 2019, 05:15 PM
లోక్ సభలో ఎంపీల ప్రమాణస్వీకార కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వంతు వచ్చింది. ప్రమాణస్వీకారం చేసేందుకు ఆయన తన స్థానం నుంచి లేవగానే... 'భారత్ మాతాకీ జై' అంటూ బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. అయితే, మీ ఇష్టం వచ్చినట్టు అరుచుకోండి అన్నట్టుగా గాల్లో చేతులు ఊపుతూ పోడియంలోని వచ్చిన ఒవైసీ... ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ముగించారు. తన ప్రమాణాన్ని 'జై భీమ్.. జై భీమ్.. తక్బీర్.. అల్లాహు అక్బర్.. జై హింద్' అంటూ ముగించారు.