byసూర్య | Tue, Jun 18, 2019, 03:24 PM
రూ. కోటి విలువచేసే బ్రౌన్ షుగర్ను అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన ఒడిశాలోని బాలేశ్వర్లో చోటుచేసుకుంది. కారులో తరలిస్తున్న కిలో బ్రౌన్షుగర్ను ఆబ్కారీ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. బ్రౌన్ షుగర్ తరలిస్తున్న నలుగురు వ్యాపారులను అరెస్టు చేశారు. బెంగాల్ నుంచి తరలిస్తుండగా బాలేశ్వర్ వద్ద అధికారులు రైడ్ చేసి స్వాధీనం చేసుకున్నారు.