byసూర్య | Tue, Jun 18, 2019, 02:29 PM
మనం సహజంగా లూటీ అంటే ఇంట్లో దొంగలు పడటమో, లేక బైకు ఎత్తుకుపోవడమో లేక ఏదైనా వస్తువువో అనుకుంటాం. కాని ఈ మధ్య అలాంటి దొంగతనాలు మనేశారు. ఏకంగా చేపల చేరువుల మీదనే పడ్డారు. నిన్నగాక మొన్న సూర్యాపేటలోని చేరువులోని చేపలను లూటీ చేశారు కదా. ఆ వార్త మరవక ముందే మళ్లీ అదే తరహాలో మరో చేపల చెరువు లూటీకి గురైంది. అయినా పోలీసలు ఏం చేయలేకపోతున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలంలో చేపల చెరువులు పెద్ద ఎత్తున లూటీకి గురవుతున్నాయి. గతంలో నేరెడ, కాంపెల్లిలో.. ఇప్పుడు చింతపల్లి చెరువులో చేపలు లూటీ అవుతున్నాయి. సమీప తండాల జనం ఈ లూటీకి పాల్పడుతున్నారు. ప్రజలు భారీగా ఉండటంతో పోలీసులు అడ్డుకోలేక చేతులెత్తేస్తున్నారు. దీంతో చేపల చెరువు యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.