byసూర్య | Tue, Jun 18, 2019, 12:43 PM
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని ధమ్తారి జిల్లాలో మంగళవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందారు. ఘటనాస్థలిలో మావోయిస్టు మృతదేహంతో పాటు ఎస్ఎల్ఆర్ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ కొనసాగిస్తున్నారు.