byసూర్య | Tue, Jun 18, 2019, 10:08 AM
తనకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి ఉంటే తెంగాణాలో కాంగ్రెస్ పార్టీకి ఇంత దుర్భర పరిస్థితి వచ్చేది కాదన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మంగళవారం ఆంధ్ర భవన్కి వచ్చేసిన ఆయన కాసేపు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆవేదన కలిగిస్తున్నాయన్నారు. తాను పార్టీమారతానంటూ వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని, తాను పార్టీ మారే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తన నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలను సంప్రదించిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటానని అంతవరకు పార్టీ మారే యోచనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
తనకు తెలంగాణ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఎన్నికల ముందు నుంచి కోరుతున్నానని, ఆ పదవి తనకు ఇచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ లో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే కష్టపడ్డారో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కష్టపడి కచ్చితంగా అధికారంలోకి తీసుకు వచ్చే వారమన్నారు.