byసూర్య | Tue, Jun 18, 2019, 09:53 AM
జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మండలం కొండేరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందారు. రోడ్డు పక్కన ఆటోకు మరమ్మతులు చేస్తుండగా వాహనం ఢీకొంది. మృతులు కడప జిల్లా ప్రొద్దుటూరు వాసులుగా గుర్తించారు. ఆటోలో మామిడికాయల లోడుతో హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.