పంజగుట్టలో వీహెచ్, హర్షకుమార్ అరెస్ట్

byసూర్య | Tue, Jun 18, 2019, 08:14 AM

హైదరాబాద్‌లోని పంజగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలు వీహెచ్, హర్షకుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కొందరు ప్రయత్నించగా ఇటీవల పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాదు, దానిని చెత్త తరలించే వాహనంలో పడేయడం అప్పట్లో వివాదాస్పదమైంది. ఈ ఉదయం ఓ లారీలో విగ్రహాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్, వివిధ సంఘాల నేతలు చౌరస్తాలో దానిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు హనుమంతరావు, హర్షకుమార్ సహా అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ సమితి అధ్యక్షుడు గుడిమల్ల వినోద్‌కుమార్‌ను అరెస్టు చేసి బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అంబేద్కర్ విగ్రహాన్ని, దానిని తీసుకొచ్చిన లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, నేతల అరెస్ట్‌తో పంజగుట్టలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. 


Latest News
 

జైలు అధికారులు వసతులు కల్పించడం లేదు: ఎమ్మెల్సీ కవిత Fri, Mar 29, 2024, 09:55 AM
కొత్త తరం నాయకత్వం తయారు చేస్తాం: కేటీఆర్ Fri, Mar 29, 2024, 09:42 AM
కేంద్రీయ విద్యాలయల్లో ప్రవేశాలకు షెడ్యూల్ Fri, Mar 29, 2024, 09:25 AM
ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు Fri, Mar 29, 2024, 09:09 AM
పెరిగిన ఎండలు... వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ Fri, Mar 29, 2024, 09:07 AM