byసూర్య | Mon, Jun 17, 2019, 11:36 PM
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కోమటి రెడ్డి రాజగోపాల్తో సహా పలువురు నేతలు ఆరోపణలు గుప్పించడంతో పాటు మరోవైపు కేంద్ర అధికార పార్టీ బీజేపీ కూడా కాంగ్రెస్ నాయకులకు ఎరవేయటం ద్వారా తెలంగాణాలో బలపడి వచ్చే ఎన్నికల నాటికి అధికారం చేపట్టాలనే ప్లాన్ లో ఉండటంతో అప్రమత్తమైన కాంగ్రెస్ అగ్ర నాయకులు తెలంగాణలో పార్టీని పటిష్టం చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే పీసీసీ చీఫ్గా కొత్తవారిని నియమించాలని నిర్ణయానికి వచ్చింది. చాలామంది నాయకులు పీసీసీ చీఫ్ పదవి తమకు కావాలంటే తమకే ఇవ్వాలనే గతంలో డిమాండ్లు గ చేసిన వారంతా ప్రస్తుత పరిస్థితిలో ఈ పదవి చేపట్టడం కత్తి మీద సాము కావటంతో చాలా మంది వెనక్కి తగ్గుతున్నారు. టీఆర్ఎస్ను ధైర్యంగా ఢీకొట్టగల నేతగా పేరున్న రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి రావడం ఫిక్స్ అయినట్టు పార్టీ వర్గాలలో వినవస్తోంది. ఆతని తో పాటు పార్టీలో సౌమ్యుడు, వివాద రహితుడుగా ఉన్న మాజీ మంత్రి శ్రీధర్ బాబు పేరు కూడా ఈ రేసులో ఉన్నట్టు బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్గా ఉన్న రేవంత్ బిజెపిలో చేరుతారంటూ వచ్చిన వార్తలపై ఆతని వివరణ తీసుకున్నాకే ఈ పదవిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెపుతున్నాయి.