కేటీఆర్ చొరవతో స్వదేశానికి చేరుకున్న గల్ఫ్ బాధితులు

byసూర్య | Mon, Jun 17, 2019, 07:07 PM

 తెలంగాణ రాష్ట్ర సమితి కార్వ నిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ చొరవతో 39 మంది తెలంగాణ కార్మికులు ఈరోజు సౌదీ నుంచి హైదరాబాద్ కి చేరుకున్నారు. కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 60 మంది కార్మికులు గత ఏడాది సౌదీలో నిర్మాణరంగ సంస్థలో పని కోసం వెళ్లారు. అయితే గత ఆరు నెలలుగా వారికి ఎలాంటి వేతనాలు ఇవ్వకుండా కంపెనీ పని చేయించుకోవడంతో పాటు సరైన, ఆహారాన్ని కూడా సంస్థ అందించలేకపోయింది. తిండికి, ఉపాధికి అనేక కష్టాలు పడుతున్న వీళ్లు, తమ సమస్యను ట్విట్టర్ ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారికి తెలియజేశారు.


కార్మికుల సమస్యల పైన వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కేటీఆర్ కోరారు. దీంతోపాటు సౌదీ లోని భారత రాయబార కార్యాలయం అధికారులకు కూడా కేటీఆర్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. సౌదీ లోని భారత రాయబార కార్యాలయం స్పందించి, కార్మికుల సమాచారం ఆధారంగా వారిని గుర్తించి తెలంగాణకి పంపించేందుకు ఏర్పాట్లు చేసింది. తమ వద్ద ఉన్న వర్క్ పర్మిట్ వీసా గడువు పూర్తవడంతో భారత రాయబార కార్యాలయం వారికి తాత్కాలిక ఎగ్జిట్ విసాలను ఇవ్వడం జరిగింది. వీరందరికీ విమాన టికెట్లను సమకూర్చి తెలంగాణకి పంపించారు.


సౌదీ నుంచి తెలంగాణ కార్మికులు స్వరాష్ట్రానికి చేరుకోవడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సౌదీలోని భారత రాయభార కార్యాలయంతోపాటు, తెలంగాణ ఎన్నారై శాఖాధికారులకు దన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్నారై శాఖ అధికారి చిట్టిబాబు కార్మికులను తెలంగాణ విమానాశ్రయంలో రిసీవ్ చేసుకుని వారిని స్వస్థలాలకు పంపించే ఏర్పాటు చేశారు.


Latest News
 

బ్యాక్ లాగ్ ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ Thu, Mar 28, 2024, 04:27 PM
బీఆర్ఎస్ కౌన్సిలర్ చాంద్ పాషాను పరామర్శించిన సండ్ర Thu, Mar 28, 2024, 04:27 PM
ఉపాధిని ఎత్తివేసే ఆలోచన విరమించుకోవాలి Thu, Mar 28, 2024, 04:26 PM
పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి Thu, Mar 28, 2024, 04:26 PM
భ్రూణ హత్యలు పెరుగుతున్నాయి: పీఓడబ్ల్యూ Thu, Mar 28, 2024, 04:25 PM