byసూర్య | Mon, Jun 17, 2019, 05:22 PM
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ లోక్సభలో ఎంపీగా ప్రమాణం చేశారు. 17వ లోక్సభ సభ్యులు ఇవాళ ప్రమాణం చేస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేత రాహుల్.. కేరళలోని వయనాడ్ నుంచి ఎంపికయ్యారు. లోక్సభ సభ్యుడిగా వరుసగా నాలుగవ సారి బాధ్యతలు స్వీకరించినట్లు రాహుల్ తన ట్విట్టర్లో తెలిపారు. ఇంగ్లీష్ భాషలో రాహుల్ ప్రమాణం చేశారు. చాలా వరకు ఎంపీలు తమతమ ప్రాంతీయ భాషల్లో ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారంతో పార్లమెంట్తో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభమైందన్నారు. భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసాన్ని ప్రదర్శించనున్నట్లు రాహుల్ చెప్పారు. మొత్తం రెండు రోజుల పాటు 542 మంది ఎంపీలుగా ప్రమాణం చేయనున్నారు. అయితే ఇవాళ ఉదయం మోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో సభలో సభ్యుల నినాదాలతో హోరెత్తింది. అయితే రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎంపీ రాందాస్ అత్వాలే మరోవిధమైన నినాదం చేశారు. సభలో నిలబడి.. రాహుల్ ఎక్కడ ఉన్నారంటూ ప్రశ్నించారు. రాహుల్ ఇక్కడే ఉన్నారు, వస్తారని.. ప్రతిపక్ష బెంచ్ల నుంచి సమాధానం వచ్చింది.