ఆ ఎమ్మెల్యేల కంటే ముంబై రెడ్‌లైట్ ఏరియావాల్లే నయం

byసూర్య | Mon, Jun 17, 2019, 05:09 PM

ఒక పార్టీ గుర్తుపై గెలిచి.. మరో పార్టీలోకి వెళుతున్న ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న ఎమ్మెల్యేల కంటే రెడ్‌లైట్ ఏరియాల్లో పడుపు వృత్తి చేసుకునే మహిళలే నయమన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంపై నారాయణ స్పందిస్తూ, ఫిరాయింపులను ఎవరు ప్రోత్సహించినా రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వల్లే తెలంగాణ రాష్ట్రానికి చెడ్డపేరు వస్తోందని, అభివృద్ధి కుంటుపడుతుందని ఆరోపించారు.


ముఖ్యంగా, పార్టీ ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేల కంటే ముంబై రెడ్‌లైట్ ఏరియావాళ్లే నయం అంటూ విమర్శలు గుప్పించారు. తెరాసలో ఉంటేనే నిధులు ఇస్తామని ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులకు కేసీఆర్ చెబుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెరాస ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటే ఇక ఎన్నికలు ఎందుకని నారాయణ ప్రశ్నించారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM