byసూర్య | Fri, Mar 22, 2019, 03:39 PM
పూరి : భువనేశ్వర్లోని పూరి స్టేషన్లో అగ్నిప్రమాదం సంభవించింది. పూరి - హటియా తపస్విని ఎక్స్ప్రెస్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన సమయంలో రైలులో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. మొదట ఎస్4 బోగీ నుంచి దట్టమైన పొగలు వచ్చి మంటలు అలుముకున్నాయి. ఎస్4 బోగీ పూర్తిగా కాలిపోగా, ఎస్3, ఎస్5 బోగీలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఫైర్ సిబ్బంది, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కలిసి మంటలను ఆర్పేశారు.