byసూర్య | Fri, Mar 22, 2019, 03:01 PM
నిజామాబాద్ : టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ శివారులోని సారంగాపూర్ హనుమంతుడిని దర్శించుకున్నారు. నామినేషన్ వేసే కంటే ముందు కవిత తన భర్త అనిల్తో కలిసి ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు చేశారు. నామినేషనల్ పత్రాలను హనుమంతుని పాదాల చెంత ఉంచి మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ సుమనారెడ్డి, నాయకులు ఈగ గంగారెడ్డి, మోహన్రెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.