byసూర్య | Fri, Mar 22, 2019, 02:14 PM
మెదక్ : తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీనే శ్రీరామరక్ష అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. కొత్త ప్రభాకర్రెడ్డి మెదక్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేసిన సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కీలకం కాబోతుందన్నారు. గజ్వేల్కు త్వరలో రైలు రాబోతుంది. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కొత్త ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తాం. మెదక్ ఎంపీగా కొత్త ప్రభాకర్రెడ్డికి అవకాశం ఇచ్చినందుకు హరీష్రావు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆనవాయితీ ప్రకారం కోనాయిపల్లి దేవాలయంలో కొత్త ప్రభాకర్రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ కోనాయిపల్లి వేంకటేశ్వరుని ఆశీస్సులతో అన్ని పనుల్లో విజయం సాధించారు. వేంకటేశ్వరుని దయతో కొత్త ప్రభాకర్రెడ్డి ఎంపీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తారు అని హరీష్రావు తెలిపారు.