byసూర్య | Fri, Mar 22, 2019, 09:55 AM
జగిత్యాల జిల్లాలో అధికారులు పంటనష్టం లెక్కించారు. జిల్లాలోని ఈ నెల 20వ తేదీన వడగండ్ల వాన కురిసిన సంగతి తెలిసిందే. ధర్మపురి, బుగ్గారం, గొల్లపల్లి మండలాల్లో భారీగా పంటనష్టం జరిగింది. 2319 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, 820 ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం జరిగింది. నష్టంపై అధికారులు నివేదిక రూపొందించారు. త్వరలోనే రైతులకు నష్టపరిహారం అందిస్తామని మంత్రి కొప్పల ఈశ్వర్ తెలిపారు.