byసూర్య | Thu, Mar 21, 2019, 12:27 PM
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో హోలీ సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను ఒక్కతాటిపైకి తెచ్చే హోలీ పండుగ విశిష్టమైందని, అందరి జీవితాల్లో వెలుగులు విరబూయాలని మంత్రి ఆకాంక్షించారు.