byసూర్య | Thu, Mar 21, 2019, 10:30 AM
మహబూబ్నగర్ జిల్లాలోని భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామ సమీపంలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.