byసూర్య | Thu, Mar 21, 2019, 10:29 AM
జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండలం పలికేరా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో మట్టదొడ్డి గ్రామవాసి మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం మద్రికూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న వ్యక్తిని ద్విచక్రవాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.