byసూర్య | Thu, Mar 21, 2019, 08:11 AM
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోని ఆంధ్ర మహిళా సభ స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేటిక్స్ కళాశాల లో హోళీ వేడుకలను ముందస్తుగా జరుపుకున్నారు. పండుగ రోజు సెలవు కావడంతో ఒక రోజు ముందస్తుగానే విద్యార్థినులు ఒకరిపై మరొకరు సహజ రంగులు చల్లుకున్నారు. సహజ రంగుల ద్వారా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం కాపాడుకోవాలనే భావనతో తామంతా పండుగను జరపుకుంటున్నామని విద్యార్థులు తెలిపారు. ప్రతి ఏటా హోళీని తమ కళాశాలలో ముందురోజే జరుపుకుంటామని చెప్పారు. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే సహజ రంగులను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు.