byసూర్య | Wed, Mar 20, 2019, 09:02 PM
యాష్కీ వినతి మేరకు నిజామాబాద్ లో పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు కోదండరామ్ వెల్లడించారు. గౌడ్ కు మద్దతుగా జనసమితి ప్రచార పాదయాత్ర చేపట్టనున్నట్లు జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ చెప్పారు. హైదరాబాద్ లోని జనసమితి ప్రధాన కార్యాలయంలో బుధవారం సాయంత్రం మధుయాష్కీ కోదండరామ్ ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ సాధించడంలో రాజీలేని పోరు చేసిన మధు గెలుపు చారిత్రక అవసరమని కోదండరామ్ పేర్కొన్నారు.
నిజామాబాద్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి మధుగౌడ్ యాష్కీ గౌడ్ కి మద్దతుగా పోటీ నుంచి తప్పుకుంటున్నామని తెలంగాణ ప్రకటించారు. తెలంగాణతో పాటు జాతీయస్థాయి రాజకీయాలు, ఎన్నికల సమీకరణలు ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఎర్రజొన్న, పసుపు రైతుల ను నిలువు దోపిడీ చేస్తున్న వ్యాపారులపై ప్రభుత్వం మమకారం చూపుతోందని కోదండరామ్, మధుయాష్కీ విమర్శించారు. రైతులపై ఉక్కుపాదం మోపి భయానక పరిస్థితిని ప్రభుత్వమే సృష్టించడం దారుణమని వారు ఆరోపించారు.