byసూర్య | Wed, Mar 20, 2019, 05:07 PM
తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు అనిల్ జాదవ్. ఆయనతో పాటు బోథ్ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ...మోడీ గారి వేడి తగ్గింది.2014 లో ఉన్న జోరు ఇప్పుడు లేదు.కాంగ్రెస్ ఏమో గాడి తప్పి పోయింది.కాంగ్రెస్ వాళ్లే పరిస్థితి చాలా గోరం.రేపు మన 16 ఎంపీలు చాలా కీలకం కాబోతున్నారు.ఢిల్లీ గులాంలు కావాలా? తెలంగాణ గులాబీలు కావాలా? ఆలోచించుకోవాలి. కాంగ్రెస్, బీజేపీలతో ఒరిగిందేమీ లేదు. వాటి పాలనలో దేశం ఎలాంటి అభివృద్ధి సాధించలేదు. దేశంలో ఇంకా పేదరికం ఉంది.దేశంలో మోదీ హవా తగ్గింది. ఎన్డీయేకు 150, యూపీఏకు 100 సీట్లకు మించి వచ్చే పరిస్థితి లేదు. 16 ఎంపీ సీట్లు గెలిచి ఢిల్లీని శాసించాలి. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉందని కేటీఆర్ విమర్శించారు.ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ జి.నగేష్, మాజీ మంత్రి శ్రీ జోగు రామన్న, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.