నరేంద్ర మోడీ, అమిత్ షా లకు మమతా బెనర్జీ సవాల్

byసూర్య | Wed, Mar 20, 2019, 12:43 PM

ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సవాలు విసిరారు. పూజలు చేయడమంటే నుదిటికి తిలకం దిద్దుకోవడం కాదని, దమ్ముంటే తనతో మంత్రాలు చదవడానికి రావాలని సవాల్ చేశారు. బీజేపీ నేతలు తన మతాన్ని ప్రశ్నించడంపై మండిపడిన మమత ఈ సవాలు విసిరారు.

‘‘పూజ అంటే నుదిటికి తిలకం దిద్దుకోవడం కాదు. మంత్రాల అర్థాలను పూర్తిగా తెలుసుకోవాలి. మోదీ-షా ద్వయాన్ని నేను సవాల్ చేస్తున్నా. దమ్ముంటే నాతో మంత్రాలు చదవడానికి రావాలి’’ అని కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు. తన మతం గురించి లెక్చర్లు అవసరం లేదని, మానవత్వమే తన మతమని తేల్చిచెప్పారు. పశ్చిమబెంగాల్‌లో ఎన్నో ఆలయాలను తమ ప్రభుత్వం పునరుద్ధరించినట్టు మమత తెలిపారు. మతం, మందిరం పేరుతో రాజకీయాలు చేయడమే బీజేపీకి తెలుసని మమత మండిపడ్డారు. వారికి రామ మందిరం నిర్మించడం చేతకాదని మమత ఆరోపించారు.


Latest News
 

పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM
కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ సిద్ధం Fri, Apr 19, 2024, 08:58 PM
చిలుకూరు బాలాజీ గరుడ ప్రసాద వితరణకు పోటెత్తిన భక్తులు.. తొక్కిసలాట Fri, Apr 19, 2024, 07:49 PM