byసూర్య | Wed, Mar 20, 2019, 08:51 AM
హైదరాబాద్ నగరంలో ఈరోజు అమీర్పేట-హైటెక్ సిటీ మెట్రో రైలు ప్రారంభం కానుంది. గవర్నర్ నరసింహన్ అమీర్పేట-హైటెక్ సిటీ మెట్రో రైలును ప్రారంభించనున్నారు. అమీర్పేటలో ఉదయం 9.12 గంటలకు గవర్నర్ మెట్రో రైలును ప్రారంభించనున్నారు. మెట్రో ప్రారంభంతో నాగోలు నుంచి హైటెక్ సిటీకి వెళ్లేందుకు వీలు కలగనుంది. ఈ రూట్లో మెట్రో సర్వీసు ప్రారంభంతో నగరవాసుల, ఐటీ ఉద్యోగుల కష్టాలు, ట్రాఫిక్ సమస్యలు తప్పనున్నాయి. ప్రస్తుతం ఈ రైలు జూబ్లిd చెక్పోస్ట్, పెద్దమ్మతల్లి గుడి, మాదాపూర్ స్టేషన్లలో ఆగదు. రివర్సల్ లేని కారణంగా ఈ మూడు స్టేషన్లలో మెట్రో రైలు ఆగదని మెట్రో అధికారులు చెబుతున్నారు.