byసూర్య | Wed, Mar 20, 2019, 08:45 AM
హైదరాబాద్ : హోలీని ప్రశాంతంగా జరుపుకోవాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ కోరారు. ముందస్తు భద్రతలో భాగంగా హోలీ సందర్భంగా బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి 22 శుక్రవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలను మూసివేస్తున్నట్టు ఆయన మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండు రోజులు నిబంధనలను అతిక్రమించి మద్యం విక్రయాలు జరుపరాదని తెలిపారు. బలవంతంగా ఇతరులపై రంగులను వేయొద్దన్నారు. గుంపులు.. గుంపులుగా తిరగడం, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ రోడ్లపై ఇతర వాహనదారులను ఇబ్బందులకు గురి చేయొద్దని సీపీ స్పష్టం చేశారు.