byసూర్య | Tue, Mar 19, 2019, 08:10 PM
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్లో ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సురేశ్రెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవితను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్, బీజేపీలు కనిపించడం లేదు. ఈ రెండు పార్టీ గోడలకు మాత్రమే అంకితం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతీ కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 16 స్థానాల్లో విజయం సాధించి పార్లమెంటులో కీలక పాత్ర పోషించడం ఖాయం. నిజామాబాద్ప్రజలందరూ ఒకటే చెబుతున్నారు. బతుకమ్మ వర్సెస్ దద్దమ్మ… మీకు బతుకమ్మ కావాలా? దద్దమ్మలు కావాలా ? ప్రజలే తేల్చుకోవాలి’ అని సురేశ్రెడ్డి అన్నారు. ‘ఇందూరు బరిలో దిగిన మన చెల్లెమ్మ, బతుకమ్మ, కవితమ్మనే గెలిపించాలి అని అన్నారు.