byసూర్య | Tue, Mar 19, 2019, 03:31 PM
బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా జి.కిషన్ రెడ్డి మరియు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్. రాంచందర్ రావు గారిని బరిలోకి దించిన కేంద్ర అధిష్టానం. సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి పోటీ చేయడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ బరిలో ఉంటానని ప్రకటించినప్పటికీ పార్టీ నాయకత్వం కిషన్రెడ్డిని ఆ స్థానం నుండి నిలబెట్టాలనే ఆలోచనలో ఉంది. ఇవాళ కేంద్ర ఎన్నికల కమిటీ మరోసారి సమావేశమై తొలివిడత అభ్యర్థులపై తుది నిర్ణయం తీసుకోనుంది.2018 ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనంలో కిషన్ రెడ్డి ఓడిన సంగతి తెలిసిందే.