byసూర్య | Tue, Mar 19, 2019, 03:22 PM
ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే సోయం బాబురావు బీజేపీలో చేరారు. సోయం బాబురావు కాంగ్రెస్ నుండి ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఆశించారు. అయితే కాంగ్రెస్ పార్టీ రమేష్ రాథోడ్ కి టికెట్ కేటాయించడంతో సోయం బాబురావు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బాబురావుకు బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వనుందని వార్తలు వస్తున్నాయి.