byసూర్య | Tue, Mar 19, 2019, 01:30 PM
న్యూఢిల్లి : పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ కంపెనీ రిలయెన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ చెల్లించాల్సిన 80 మిలియన్ డాలర్ల అప్పును ఆయన సోదరుడు ముఖేష్ అంబానీ చెల్లించారు. ఎరిక్సన్ ఎబి సంస్థకు అనిల్ అంబానీ కంపెనీ బకాయిలు పడింది. బకాయిలు తీర్చడంలో అనిల్ అంబానీ విఫలమవడంతో ఎరిక్సన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ఒక నెలలో బకాయిలు తీర్చాలని లేదా జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని అనిల్ను ఆదేశిస్తూ తీర్పు చెప్పింది. నేటితో సుప్రీంకోర్టు విధించిన గడువు తీరిపోయింది. కాగా ఈ బకాయిలను ముఖేష్ తీర్చివేశాడు. ముఖేష్ చేసిన సహాయంపట్ల అనిల్ స్పందిస్తూ తన సోదరుడికి, వదినకు ఎంతో రుణపడ్డామని అన్నారు.