byసూర్య | Tue, Mar 19, 2019, 01:01 PM
కరీంనగర్ : అనారోగ్యంతో మృతి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇందుర్తి మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు భౌతిక కాయానికి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ , శాసనసభ్యులు గంగుల కమలాకర్ లు పూలమాలవేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో శాసనమండలి సభ్యులు నారదాసు లక్ష్మణ్ రావు చైర్ పర్సన్ తుల ఉమ, టీస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సేన్ , మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ ,మేయర్ రవీందర్ సింగ్ ,కార్పొరేటర్లు వై సునిల్ రావు ,ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు నందేల్లి మహిపాల్ లు ఉన్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.