byసూర్య | Tue, Mar 19, 2019, 12:58 PM
ఖమ్మం: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి, పొలిట్ బ్యూరో పదవికి నామా నాగేశ్వరరావు రాజీనామా చేశారు. నామా నాగేశ్వరరావు నిన్న కేసీఆర్ ను కలిశారు. ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామా పోటీ చేసే అవకాశముంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ లో చేరిన విషయం విదితమే.