byసూర్య | Tue, Mar 19, 2019, 12:55 PM
లక్నో : కాంగ్రెస్ నేతలకు ఎన్నికలంటే విహార యాత్రలేనని ఉత్తర్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ వ్యాఖ్యానించారు. ఉత్తర్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా మూడు రోజులపాటు గంగా యాత్ర చేస్తూ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. దీనిపై దినేశ్ శర్మ తీవ్రంగా స్పందించారు. గాంధీ కుటుంబ సభ్యులు ఎన్నికల సమయంలో వస్తారని, పిక్నిక్లు జరుపుకొని వెళ్లిపోతారని, మళ్లిd ఐదేళ్ల తరువాతే కనిపిస్తారని ఆయన వ్యాఖ్యానించారు.