byసూర్య | Tue, Mar 19, 2019, 12:46 PM
ఢిల్లీ : పార్టీ ఫిరాయింపులపై దేశవ్యాప్తంగా ఆందోళన చేసేందుకు హైకమాండ్ గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను కలుస్తామన్నారు. ప్రజాస్వామ్యానికి కేసీఆర్ సవాలు విసురుతున్నారన్నారు. డబ్బుతో ఓటుని కొనడం అంటే రాజ్యాంగాన్ని కాలరాయడమేనని పేర్కొన్నారు.