16 స్థానాలు గెలవడమే టీఆర్ఎస్ లక్ష్యం: వినోద్

byసూర్య | Tue, Mar 19, 2019, 12:39 PM

కరీంనగర్:  పార్లమెంట్ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలు గెలవడమే టీఆర్ఎస్ లక్ష్యమని ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. మంగళ వారం కరీంనగర్ లోని ఎస్.ఆర్.ఆర్ కళాశాల మైదానంలో ఆయన ప్రచారం నిర్వహించారు.  వాకర్స్ ను కలిసి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 16 సీట్లలో విజయం సాధిస్తుందన్నారు. భవిష్యత్తులో టీఆర్‌ఎస్‌ దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పాలనతో విసుగు చెందిన రాష్ట్రాలన్నీ ఏకమవుతున్నాయన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉందన్నారు.  ప్రచారంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్ సింగ్ తోపాటు పలువురు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM