byసూర్య | Tue, Mar 19, 2019, 12:39 PM
కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలు గెలవడమే టీఆర్ఎస్ లక్ష్యమని ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. మంగళ వారం కరీంనగర్ లోని ఎస్.ఆర్.ఆర్ కళాశాల మైదానంలో ఆయన ప్రచారం నిర్వహించారు. వాకర్స్ ను కలిసి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 సీట్లలో విజయం సాధిస్తుందన్నారు. భవిష్యత్తులో టీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన రాష్ట్రాలన్నీ ఏకమవుతున్నాయన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉందన్నారు. ప్రచారంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్ సింగ్ తోపాటు పలువురు పాల్గొన్నారు.