byసూర్య | Tue, Mar 19, 2019, 12:39 PM
టీ కాంగ్రెస్ పార్టీ లో నేతల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి.కన్నా తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ లో నాయకులు పార్టీను వీడుతుంటే వారిని కాపాడు కోవాల్సిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం తమకు ఏమి పట్టనట్లు వ్యహరిస్తున్నారు అని కొందరు సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు .
టీకాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ, టీపీసీసీ చీఫ్ ఉత్తమకుమార్ రెడ్డి పై ఆరోపణలు చేసి తేరా మీదకి రావడం తో కాంగ్రెస్ లో రాజకీయం వేడెక్కింది.ఉత్తమ్ వ్వవహార శైలి పై గుర్రుగా ఉన్న సీనియర్ నేతలు . ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ ప్రక్షాళన జరగకపోతే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని, నాయకత్వం మార్పు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. పార్టీ ప్రక్షాళన జరిగిననాడే తిరిగి గాంధీ భవన్లో ఆడుగుపెడతానని సర్వే స్పష్టంచేశారు