byసూర్య | Mon, Mar 18, 2019, 08:45 PM
గత రెండు మూడు రోజులుగా జగ్గారెడ్డి తెరాసలో చేరబోతున్నాడని ప్రచారం జరగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు.తెరాసలో చేరాల్సి వస్తే రాజకీయాల్ని వదిలేస్తానంటూ సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
గతంలో తాను పార్టీ మారడం వల్ల తన ఇమేజ్ దెబ్బతిందని కూతురు విజయారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆలోచింప జేశాయని, ఆమె మాటను గౌరవిస్తానని, కాంగ్రెస్లోనే కొనసాగుతానని జగ్గారెడ్డి స్పష్టం చేయడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. గత కొన్ని రోజులుగా జగ్గారెడ్డి తెరాసలో చేరుతున్నారంటూ ఊహాగానాలు మొదలుకావడం, అదే సమయంలో జగ్గారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లడంతో తను తెరాసలో చేరడం ఖాయమే అంటూ టీపీసీసీ భయాందోళనకు గురైంది. అయితే జగ్గారెడ్డి తాజా వ్యాఖ్యలతో తెలంగాణ పీసీసీ ఊపిరి పీల్చుకున్నట్లు తెలుస్తోంది.