byసూర్య | Mon, Mar 18, 2019, 08:19 PM
అమీర్ పేట - హైటెక్ సిటీ మెట్రో రైలు ఈనెల 20వ తేదీన పరుగులు పెట్టనున్నది. 20వ తేదీ ఉదయం 10.30 గంటలకు అమీర్ పేట స్టేషన్ లో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జెండా ఊపి ప్రారంభించనున్నారు. కారిడార్ 3లో ఇప్పటి వరకు నాగోల్ నుంచి శిల్పారామం వరకు 17 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చింది. ఈ రూట్ లో రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. హైటెక్ సిటీ వరకు పనులు పూర్తి కావడంతో కారిడార్ 3 లో మొత్తం 27 కిలోమీటర్ల మార్గం పూర్తిగా అందుబాటులోకి రానున్నది.