గులాబీ స్కోర్ వంద‌కు చేర్చే ప‌నిలో వ‌న‌మా

byసూర్య | Mon, Mar 18, 2019, 03:03 AM

 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ముచ్చ‌ట‌గా మూడు నెల‌లు కాక ముందే విప‌క్షాల‌ను ఖాళీ చేయించే ప‌ని అధికార తెరాస చేప‌ట్టింది. ఇప్ప‌టికే వ‌రుస మంత‌నాలు జ‌రుపుతున్న ఆ పార్టీ నేత‌లు కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలకు గులాబి కండువాలు క‌ప్పే ప‌నిలో ఉన్నారు.  ఇప్పటికే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారు ఎక్కేయ‌టంతో   తాజాగా ఆ జాబితాలోకి కొత్తగూడెం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే  వనమా వెంకటేశ్వరరావు కూడా చేసారు.  ఆదివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయ‌న  నేరుగా  ముఖ్యమంత్రి కేసీఆర్‌తో  భేటీ అయ్యి,   త్వరలో టీఆర్‌ఎస్‌లో చేరాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిపారు.   ప్రజలు, పార్టీ శ్రేణుల అభీష్టం మేరకు నడుచుకోవడమే తన విధి అని  నియోజకవర్గ అభివృద్ధికి కేసీఆర్‌ హామీ ఇచ్చినందునే  టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు వెల్లడించారు. 


16 లోక్‌సభ సీట్లు గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ... ఆపరేషన్‌ ఆకర్ష్‌ను అమలు చేస్తోంది. దీంతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కారెక్కుతున్నారు. ఈ నేపథ్యంలో వనమా నాగేశ్వరరావు కూడా టీఆర్‌ఎస్‌లో చేరడం అసెంబ్లీలో ఆ పార్టీ బ‌లం వంద మార్కు చేరేలా ఉంది. 


 


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM