మోడీ ట్వీట్ కు స్పందించిన నాగార్జున

byసూర్య | Fri, Mar 15, 2019, 03:08 PM

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కొద్ది రోజులుగా త‌న ట్విట్ట‌ర్లో సెల‌బ్రిటీల‌ని ట్యాగ్ చేస్తూ ప్ర‌తి ఒక్క‌రు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకునేలా చైత‌న్యం తీసుకురావాల‌ని కోరుతూ వ‌రుస ట్వీట్స్ చేస్తున్నారు. రీసెంట్‌గా మోహ‌న్ లాల్‌, అక్కినేని నాగార్జున‌ని ట్యాగ్ చేసిన మోదీ డియ‌ర్ మోహన్ లాల్‌, మోదీ ఎన్నో ఏళ్ళుగా మీ న‌ట‌న‌తో మిలియ‌న్ల కొద్ది ప్రేక్ష‌కుల‌కి వినోదం పంచుతున్నారు. ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. మీరు భారీ స్థాయిలో ఓట‌ర్ల‌లో అవ‌గాహ‌న క‌లిగేలా ప్ర‌జ‌ల‌లో చైత‌న్యం తీసుకురావాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాను అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కి స్పందించిన నాగ్‌. మీ మంచి మాట‌ల‌కి ధ‌న్య‌వాదాలు. మ‌న ప్ర‌జ‌స్వామ్యాన్ని మేము న‌మ్మాం. త‌ప్ప‌క ఓటేస్తాం అని పేర్కొన్నారు. మోదీ గ‌తంలో స్వచ్ఛభారత్‌కు సోషల్ మీడియా ద్వారా ప్రచారం కల్పించడానికి ఇలా ప్ర‌ముఖుల‌ని మ‌మేకం చేసిన సంగ‌తి తెలిసిందే. 


 


 


 






Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM