యాదాద్రికి గవర్నర్ నరసింహన్ దంపతులు

byసూర్య | Fri, Mar 15, 2019, 11:38 AM

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవ వేడుకలో పాల్గొనేందుకు గవర్నర్ నరసింహన్ దంపతులు ఇవాళ ఉదయం యాదాద్రికి చేరుకున్నారు. స్వామి వారికి గవర్నర్ నరసింహన్ దంపతులు పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు. ఉగ్రరూపుని కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. నిన్న ఉదయం ఉగ్రరూపుడు జగన్మోహినిగా దర్శనం ఇచ్చారు. రాత్రి ముత్యాల పల్లకిలో అశ్వ వాహనసేవలో ఊరేగుతూ వచ్చి కల్యాణ మండపం వద్ద కల్యాణఘడియలు ఖరారు చేసుకుని ఎదుర్కోలు మహోత్సవాన్ని అంగరంగా వైభవంగా జరుపుకున్నారు. కల్యాణ వేడుకల నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM