byసూర్య | Thu, Mar 14, 2019, 03:20 PM
ఐపీఎల్ 2019 సీజన్ కోసం టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారుగా నియమించుకుంది ఆ జట్టు యాజమాన్యం. ఈ మేరకు గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ ట్విట్టర్లో అధికారిక ప్రకటన చేసింది. ఈ నియామకంతో సౌరవ్ గంగూలీ... ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్తో కలిసి పని చేయనున్నారు.ఈ సందర్భంగా సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ "ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదిరినందుకు చాలా సంతోషంగా ఉంది. గత కొన్నేళ్లుగా జిందాల్స్తో పాటు జెఎస్డబ్ల్యూ గ్రూప్ గురించి తెలుసు. ఆ గ్రూప్ తాజా స్పోర్ట్స్ వెంచర్లో భాగస్వామి అవడం చాలా ఆసక్తిగా ఉన్నా. ఆ జట్టులోని ఆటగాళ్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా" అని అన్నాడు.
ఐపీఎల్ 2019 సీజన్ కోసం ఢిల్లీ ఫ్రాంచైజీ సరికొత్తగా ముస్తాబవుతోంది. ఇప్పటికే ఢిల్లీ డేర్డెవిల్స్గా ఉన్న పేరును ఢిల్లీ క్యాపిటల్స్గా పేరు మార్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు కోచింగ్ సిబ్బంది కూడా అనేక మార్పులు చేసింది. వేలంలో కొత్త ఆటగాళ్లను కోనుగోలు చేయడంతో పాటు పలువురిని రిటైన్ చేసుకుంది.ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. ఐపీఎల్ ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఢిల్లీ ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలివలేదు. కనీసం ఫైనల్కు కూడా చేరలేదు. దీంతో ఈ సారి కచ్చితంగా విజేతగా నిలవాలన్న పట్టుదలతో ఆ జట్టు యాజమాన్యం గట్టి పట్టుదలతో ఉంది.
ఐపీఎల్ 2019 సీజన్ షెడ్యూల్ని ఇప్పటికే బీసీసీఐ విడుదల చేసింది. అయితే కేవలం 17 మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ను మాత్రమే బీసీసీఐ ప్రకటించడం విశేషం. మార్చి 24న వాంఖడేలో ముంబై ఇండియన్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి మ్యాచ్ ఆడనుంది. మార్చి 23న టోర్నీ ప్రారంభం కానుంధి. ఐపీఎల్ 2019 సీజన్ తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది.