byసూర్య | Tue, Jan 22, 2019, 09:15 PM
గాంధీ గ్రామ స్వరాజ్యం అంశాన్ని సాంఘీకశాస్త్రం పాఠ్యాంశాల్లో చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పంచాయితీ వ్యవస్థ, కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని పాఠ్యాంశంలో చేర్చాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చిన్నారుల్లో నైతిక విలువలు పెంచేలా ప్రత్యేక పాఠాలు రూపొందించాలని, తల్లిదండ్రులు, టీచర్లు, పెద్దలపట్ల చిన్నారులకు గౌరవం పెంపొందేలా పుస్తకాలు ఉండాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. గాంధీ బోధనలు, అంబేద్కర్ ఆశయాలు, ప్రముఖుల విషయాలు పాఠ్యాంశాల్లో చేర్చాలన్నారు.