byసూర్య | Tue, Jan 22, 2019, 06:08 PM
నిన్న లండన్ లో భారత ఎన్నికలలో ఉపయోగించే ఈవీఎంల హ్యాకింగ్ ప్రదర్శనలో అమెరికా సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా భారత్ జరిగిన 2014 ఎన్నికలలో బీజేపీ ఈవీఎంలను హ్యాక్ చేసి రిగ్గింగ్ చేసిందని.. దీనిపై బీజేపీకి సంబంధించిన వ్యక్తులు తమపై దాడిచేసి తమ అనుచరులను కూడా చంపేశారని వెల్లడించారు. దీనిపై భారత ఎన్నికల సంఘం పోలీసులకు లేఖ రాసింది. లండన్ ప్రదర్శన చట్టపరమైనది కాదని.. అందులో ప్రదర్శన కూడా నిర్పూపితమైనది కాదన్న ఈసీ సయ్యద్ షుజాపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.