ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం

byసూర్య | Tue, Jan 22, 2019, 04:52 PM

ఒడిశాలోని కందమాల్ జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సుమారు 50 మందితో వెళ్తున్న ఓ ట్రక్కు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందగా, మరో ఆరుగురు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. కందమాల్‌లోని గదపూర్ ఏరియా నుంచి బ్రహ్మనిగాన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే డ్రైవర్ ఆల్కహాల్ సేవించి వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాద ఘటనపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు ఉచిత వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM