byసూర్య | Tue, Jan 22, 2019, 04:28 PM
హైదరాబాద్ : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి టిఆర్ఎస్ ఎంపి వినోద్ మంగళవారం లేఖ రాశారు. తెలంగాణలో ప్రకటించిన రోడ్ల నిర్మాణం ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో జాతీయ రహదారులను పెంచాలని డిమాండ్ చేశారు. వీటిపై కేంద్రం స్పందించకపోతే బడ్జెట్ సమావేశాల్లో నిరసన తెలియజేస్తామని ఎంపి వినోద్ లేఖలో పేర్కొన్నారు.