byసూర్య | Tue, Jan 22, 2019, 04:03 PM
న్యూఢిల్లి : మాజీ కేంద్ర మంత్రి ఎంజె అక్బర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో నిందితురాలిగా జర్నలిస్టు ప్రియ రమణికి సమన్లు పంపాలా వద్దా అనే విషయమై ఈ నెల 29వ తేదీన స్థానిక కోర్టు ఒక నిర్ణయం తీసుకోనున్నది. పరువునష్టం కేసులో చట్టం ప్రకారం దోషికి రెండేళ్ల జైలు శిక్ష, లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. ఎంజె అక్బర్ లైంగికంగా వేధించాడని ప్రియరమణి ఆరోపించింది. గత ఏడాది పలువురు మీటూ అంటూ లైంగిక వేధింపులపై ఆరోపణలు చేస్తున్న సమయంలో ప్రియ రమణి 20 ఏళ్ల క్రితం అక్బర్ లైంగిక వేధింపులపై ఆరోపణలు సంధించింది.