byసూర్య | Tue, Jan 22, 2019, 03:46 PM
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ ఏర్పాటులో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టికల్ 164(ఎ) ప్రకారం మంత్రుల సంఖ్య 15శాతం మించకూడదన్నారు. మంత్రులు 12 కంటే తక్కువ ఉండేందుకు అవకాశం లేదని, సీఎం, గవర్నర్ ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. మంత్రి మండలి సూచనల మేరకు గవర్నర్ పనిచేయాలని, ఆర్థిక మంత్రి లేకుండా పరిపాలన ఎలా ఉంటుందని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.