త్వరలోనే ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను ప్రారంభిస్తాం : స్పీకర్

byసూర్య | Tue, Jan 22, 2019, 03:03 PM

హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ్యులకు సంబంధించిన నూతన క్వార్టర్స్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వివిధ పార్టీల నుంచి 119 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. మరో శాసనసభ్యుడు నామినేట్ అయ్యారు. మొత్తం 120 మంది ఎమ్మెల్యేలకు అధునాతన సౌకర్యాలతో ఇండ్లు నిర్మించారు. 4.5 ఎకరాల్లో నిర్మించిన ఇండ్ల సముదాయాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. కమిటీ వేసుకొని నియమ నిబంధనల మేరకే ఇండ్లు కేటాయిస్తామన్నారు. ఒక్కో ఫ్లాట్ 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించడం జరిగిందన్నారు. వాహనాల పార్కింగ్ కోసం 3 సెల్లార్లను నిర్మించామని తెలిపిన పోచారం.. ఒకేసారి 200 వాహనాలను నిలిపే విధంగా నిర్మాణం జరిగిందన్నారు. ఈ ఇండ్ల నిర్మాణం రూ. 166 కోట్లతో జరిగిందని పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.


Latest News
 

ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు జననం Sat, Apr 20, 2024, 02:02 PM
నీటి తొట్టెలో పడి బాలుడు మృతి Sat, Apr 20, 2024, 01:32 PM
ఇంటి వద్ద ఓటుపై శిక్షణ Sat, Apr 20, 2024, 01:30 PM
పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్ వట్టి పోతున్న తాగునీరు Sat, Apr 20, 2024, 01:28 PM
నేడు బీబీపేటకు షబ్బీర్ అలీ రాక Sat, Apr 20, 2024, 01:06 PM